గణపతి ఆవిర్భావం
గణపతి ఆవిర్భావం
ఒక నాడు పార్వతి దేవి స్నానం చేస్తుండగా , శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు. అందువల్ల అమ్మవారు సిగ్గు పడ్డారు. స్నానాన్ని అర్ధాంతరం గా ఆపేసి హడావిడిగా అంతః పురం లోనికి వెళ్లిపోయారు. అనునిత్యం తన చేత వాంచింపబడే వాడే అయినప్పటికీ కూడా ఆయన లా హఠాత్తుగా రావడం అమ్మవారికి నచ్చలేదు . ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారి చెలికత్తెలైన జయ -విజయ లు ఆ తల్లి కి ఒక సలహా ఇచ్చారు. ఇక్కడ అందరూ శివ ఘనాలే ఉన్నందు వల్ల , మన వ్యక్తి అంటూ ఒకరు ఉండాలని , ఎవరినైనా నిరోధించగల శక్తి కలవాడై ఉండాలని సలహా ఇచ్చారు. అప్పుడు అమ్మవారు ఆలోచించి , నా పక్క కూడా ఒక ఘనం ఉండాలని, అది కూడా పురుషాకృతి లో ఉండాలని అనుకున్నది. తన మెను ను నలిచినది . ఆ వచ్చిన పదార్ధముతో ఒక పురుషాకృతిని నిర్మించినది . ఆ బొమ్మకు ప్రాణం పోసి, ఆ సర్వాంగ సుందరుణ్ణి ఆశీర్వదించి, తన బిడ్డ గా స్వీకరించి ఆ సర్వాంగ సుందరుణ్ణి అమ్మవారి అంతః పుర ద్వారం దగ్గర నియమించుకుంది. ఇలా ఆ భోజ్జ గణపయ్య ఆవిర్భవించాడు.
No comments:
Post a Comment